పునీత్ చివరి సినిమాలో అతిథులుగా ఆయన అన్నలు!

పునీత్ చివరి సినిమాలో అతిథులుగా ఆయన అన్నలు!

కన్నడ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ చివరి చిత్రం ‘జేమ్స్’ ఆయన పుట్టినరోజు సందర్భంగా మార్చి 17న విడుదలకానుంది. ఈ చిత్రానికి సంబంధించిన కొత్త పోస్టర్ ను రేపు జనవరి 26న విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం తెలిపింది. పునీత్ రాజ్‌కుమార్‌ని ఆయన అభిమానులు పవర్‌స్టార్‌గా అభివర్ణిస్తారు. ఆయన అక్టోబర్ 29, 2021న గుండెపోటుతో మరణించారు. రాజ్‌కుమార్‌ అకాల మరణం అతని కుటుంబ సభ్యులు, స్నేహితులు, అభిమానులకు తీవ్ర దిగ్భ్రాంతి కలిగించింది. పునీత్ చివరి చిత్రం ‘జేమ్స్‌’ని అతని పుట్టినరోజు మార్చి 17, 2022న థియేటర్లలో విడుదల చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. జనవరి 26న ఉదయం 11.11 గంటలకు ప్రత్యేక పోస్టర్‌ను విడుదల చేయనున్నట్లు దర్శకుడు చేతన్ కుమార్ ట్వీట్ చేశారు.

దివంగత నటుడి గౌరవార్థం, కన్నడ చిత్ర పరిశ్రమలోని ప్రముఖులు మరియు పంపిణీదారులు ‘జేమ్స్‌’ సినిమాను ఎటువంటి పోటీ లేకుండా సోలోగా విడుదల చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు మార్చి 17 నుంచి మార్చి 23 వరకు రాష్ట్రంలో వారం రోజుల పాటు కన్నడ చిత్రాలేవీ విడుదల కావు. ఆ వారం రోజుల పాటు ‘జేమ్స్’ సోలో రిలీజ్ ఉంటుంది.

‘జేమ్స్’ చేతన్ కుమార్ దర్శకత్వం వహించిన యాక్షన్ ఎంటర్టైనర్. ఈ చిత్రంలో ప్రియా ఆనంద్, మేకా శ్రీకాంత్ మరియు అను ప్రభాకర్ ముఖర్జీ సహాయక పాత్రల్లో నటిస్తున్నారు. పునీత్ అన్నలు రాఘవేంద్ర రాజ్‌కుమార్ మరియు శివరాజ్‌కుమార్ కూడా ఈ సినిమాలో అతిధి పాత్రల్లో కనిపిస్తారని సమాచారం.

For More News..

కేసీఆర్‎ను గద్దె దించేందుకు కంకణబద్దులు కావాలి

అధికారులు చట్టానికి లోబడి పనిచేయడం మరిచిపోయారు

కలిసున్న కవలలకు సెపరెట్ ఓటర్ కార్డులు

పంజాబ్ ఎన్నికల్లో కొత్త ప్రచారం.. వైరల్‎గా వీడియో