శుద్ధ జలంతోనే సంపూర్ణ ఆరోగ్యం : జోగినిపల్లి పృథ్వీధర్ రావు

శుద్ధ జలంతోనే సంపూర్ణ ఆరోగ్యం : జోగినిపల్లి పృథ్వీధర్ రావు
  • విశాక ఇండస్ట్రీస్  బోర్డు డైరెక్టర్  జోగినిపల్లి పృథ్వీధర్ రావు

చందుర్తి, వెలుగు: శుద్ధ జలంతో ఆరోగ్యంగా ఉండవచ్చని విశాక ఇండస్ట్రీస్  బోర్డ్  డైరెక్టర్  జోగినిపల్లి పృథ్వీధర్​రావు తెలిపారు. ఆయన తన సొంత గ్రామం రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం మూడపల్లిలో గ్రామస్తుల దాహార్తిని తీర్చేందుకు, తన తల్లి జోగినిపల్లి సుచరితమ్మ జ్ఞాపకార్థం రూ.13 లక్షలతో బిల్డింగ్, వాటర్ ప్లాంట్ ను ఏర్పాటు చేశారు. ఆదివారం ప్లాంట్​ను ప్రారంభించారు.

సొంత ఊరిపై మమకారంతో సేవ చేస్తున్నానని తెలిపారు. గ్రామస్తులు వాటర్ ప్లాంట్ ను ఉపయోగించుకోవాలని కోరారు. భవిషత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపడతానని చెప్పారు. చిలుక అంజిబాబు, పుల్కం రవి, పుల్కం మోహన్  పాల్గొన్నారు.