
న్యూఢిల్లీ : బ్రిటిష్ ప్రధాని పదవి కోసం భారత సంతతి లీడర్, కన్వర్జేటివ్ పార్టీ నాయకుడు రిషి శునక్, విదేశాంగ సెక్రటరీ లిజ్ట్రుస్మధ్య రసవత్తర పోటీ నడుస్తోంది. బుధవారం జరిగిన ఫైనల్ రౌండ్ఓటింగ్లో రిషికి పార్టీ సహచరులు గంపగుత్తగా ఓటు వేశారు. ఇప్పటి వరకు ఆయనకు మొత్తం 137 ఓట్లు పోలయ్యాయి. అయితే సహచరుడు లిజ్ట్రుస్నుంచి రిషికి తీవ్ర పోటీ ఎదురవుతోంది. లిజ్కు ఇప్పటి వరకు మొత్తం 113 ఓట్లు వచ్చాయి. బుధవారం జరిగిన ఐదో రౌండ్ ఓటింగ్లో రిషి, లిజ్, పెన్నీ మోర్డాంట్పోటీపడ్డారు. ఈ ముగ్గురిలో రిషి టాప్లో నిలిచారు. పెన్నీకి 105 ఓట్లు వచ్చాయి. దీంతో రేసు నుంచి ఆయన ఎలిమినేట్ అయ్యారు. ఇక 1,80,000 మంది కన్జర్వేటివ్పార్టీ సభ్యుల ఓట్ల కోసం దేశవ్యాప్తంగా రిషి, లిజ్ ప్రచారం చేపట్టనున్నారు.