
- మార్కెట్ మ్యానిపులేషన్పై సైలెంట్గా ఉంటున్నది
- సాధారణ ఇన్వెస్టర్లు సర్వం కోల్పోతున్నారని ఆవేదన
న్యూఢిల్లీ: స్టాక్ మార్కెట్ మ్యానిపులేషన్పై మోదీ సర్కారు మౌనంగా ఉండడంతో ధనికులే ధనికులు అవుతున్నారని లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్గాంధీ అన్నారు. సాధారణ వినియోగదారులు సర్వం కోల్పోయి ఆర్థికంగా పతనావస్థకు చేరుకుంటున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. స్టాక్ మార్కెట్లో జేన్ స్ట్రీట్ స్కామ్పై సోమవారం రాహుల్ గాంధీ ఎక్స్ వేదికగా స్పందించారు. ఫ్యూచర్స్అండ్ ఆప్షన్స్(ఎఫ్అండ్ఓ) లో లొసుగులను తాను ముందే ఊహించానని చెప్పారు. ‘‘ఎఫ్ అండ్ఓ మార్కెట్ ‘పెద్ద కంపెనీలకు’ ప్లేగ్రౌండ్గా మారిందని నేను 2024లోనే స్పష్టంగా చెప్పా. -- చిన్న పెట్టుబడిదారుల జేబులు నిరంతరం ఖాళీ అవుతాయని ఊహించా. జేన్ స్ట్రీట్(గ్రూప్) వేల కోట్లను తారుమారు చేసిందని ఇప్పుడు సెబీ స్వయంగా అంగీకరిస్తున్నది.
సెబీ ఎందుకు ఇంతకాలం మౌనంగా ఉండిపోయింది?”అని ప్రశ్నించారు. ‘‘అనియంత్రిత ఎఫ్ అండ్ ఓ ట్రేడింగ్ ఐదేండ్లలో 45 రెట్లు పెరిగింది. 90 శాతం చిన్న పెట్టుబడిదారులు మూడేండ్లలో రూ. 1.8 లక్షల కోట్లు కోల్పోయారు” అని 2024 సెప్టెంబర్ 24న చేసిన పోస్ట్ను రాహుల్ గాంధీ ట్యాగ్ చేశారు. కాగా, ఎఫ్ అండ్ ఓ మ్యానిపులేషన్ను మోదీ సర్కారు పట్టించుకోలేదని రాహుల్ గాంధీ మండిపడ్డారు. స్టాక్ మార్కెట్నే రిగ్గింగ్ చేసే వ్యక్తులు ఇంతమంది ఉన్నారా? అని తాను ఆశ్చర్యపోయినట్టు చెప్పారు.