జూన్​2 నుంచి ఆర్​వైవీ మంజూరు పత్రాలు : అడిషనల్ కలెక్టర్ వీరారెడ్డి

జూన్​2 నుంచి ఆర్​వైవీ మంజూరు పత్రాలు : అడిషనల్ కలెక్టర్ వీరారెడ్డి

యాదాద్రి, వెలుగు : రాజీవ్ యువ వికాసం (ఆర్ వైవీ) పథకం లబ్ధిదారుల ఎంపిక వేగంగా జరుగుతోందని అడిషనల్ కలెక్టర్ వీరారెడ్డి తెలిపారు. అర్హులైనవారికి జూన్​2 నుంచి యూనిట్ మంజూరు పత్రాలు అందజేస్తామని చెప్పారు. శనివారం కలెక్టరేట్​లో నిర్వహించిన రివ్యూ మీటింగ్​లో స్కీమ్ గురించి ఆఫీసర్లు వివరించారు.

వెల్ఫేర్​డిపార్ట్​మెంట్లవారీగా ఆర్​వైవీ కోసం 39 వేల అప్లికేషన్లు వచ్చాయని తెలిపారు. రూ.50 వేల నుంచి రూ.4 లక్షల వరకు యూనిట్ వారీగా వచ్చిన అప్లికేషన్ల సంఖ్యను వివరించారు. అనంతరం అడిషనల్ కలెక్టర్​మాట్లాడుతూ యువతకు స్వయం ఉపాధి కల్పించడానికే ప్రభుత్వం ఈ స్కీమ్​ ప్రారంభించిందని తెలిపారు. 

స్పీడ్​గా సీఎంఆర్ అందించాలి..

సీఎంఆర్​ స్పీడ్​గా అందించాలని అడిషనల్ కలెక్టర్ వీరారెడ్డి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో నిర్వహించిన మీటింగ్​లో ఆయన మాట్లాడారు. వడ్ల దిగుమతి చేసుకున్న స్థాయిలో సీఎంఆర్ అందించాలని సూచించారు.