
బ్యాంకాక్: ఇండియా పారా ఆర్చర్ రాకేశ్ కుమార్.. పారా ఆర్చరీ చాంపియన్షిప్లో హ్యాట్రిక్ గోల్డ్తో సంచలనం సృష్టించాడు. బుధవారం జరిగిన మెన్స్ కాంపౌండ్ ఓపెన్ క్రౌన్ కేటగిరీలో వరల్డ్ ఐదో ర్యాంకర్ రాకేశ్ కుమార్ 145–144తో కెన్ స్వాగుమిలాంగ్ (ఇండోనేసియా)పై గెలిచి స్వర్ణంతో మెరిశాడు. కాంపౌండ్ ఓపెన్ టీమ్లో రాకేశ్–సురజ్ సింగ్ 147–144తో చుంగ్ హంగ్ వు–చిహ్ చియాంగ్ చాంగ్ (చైనీస్తైపీ)పై గెలిచి బంగారు పతకం సాధించారు. మిక్స్డ్ టీమ్ విభాగంలో శీతల్ దేవితో కలిసి బరిలోకి దిగిన రాకేశ్ 154–149తో థియోడోరా ఆడి - అయుడియా ఫెరెల్లీ– కెన్ స్వాగుమిలాండ్ (ఇండోనేసియా)ను చిత్తు చేసి మూడో గోల్డ్ సొంతం చేసుకున్నాడు. విమెన్స్ కాంపౌండ్ ఓపెన్ టీమ్ ఈవెంట్లో శీతల్ దేవి–జ్యోతి 148–137తో జిన్ యంగ్ జియోంగ్–నా మి చోయ్ (కొరియా)ను ఓడించి బంగారు పతకం నెగ్గింది. ఓవరాల్గా ఇండియా 9 మెడల్స్ (4 గోల్డ్, 4 సిల్వర్, 1 బ్రాంజ్) నెగ్గి టాప్ ప్లేస్ సాధించింది. సౌత్ కొరియా (3 గోల్డ్, 1 సిల్వర్, 1 బ్రాంజ్) రెండో ప్లేస్లో నిలిచింది.