మరో పాన్ ఇండియా మూవీలో రామ్ చరణ్

మరో పాన్ ఇండియా మూవీలో రామ్ చరణ్

టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్..మరో పాన్ ఇండియా మూవీలో నటించనున్నాడు. ఇప్పటికే RRR ద్వారా పాన్ ఇండియా స్టార్గా మారిన రామ్ చరణ్..ఆచార్య సినిమాలో మెప్పించలేకపోయాడు. అయితే ప్రస్తుతం రామ్ చరణ్ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు. RC15 వర్కింగ్ టైటిల్ తెరకెక్కుతున్న ఈ మూవీ పలు షెడ్యూల్స్ను పూర్తి చేసుకుంది. ఈ చిత్రం పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ గా రూపుదిద్దుకుంటున్నట్లు సమాచారం.  ఈ మూవీ కూడా పాన్ ఇండియా మూవీనే కావడం విశేషం. ఇది కంప్లీట్ కాగానే..రామ్ చరణ్ కోలీవుడ్ డైరెక్టర్ తో సినిమా చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఖైదీ, మాస్టర్ సినిమాలతో వరుస హిట్లు అందుకున్న లోకేష్ కనకరాజ్తో రామ్ చరణ్ సినిమా చేస్తాడని టాలీవుడ్ వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం లోకేష్.. కమల్ హాసన్తో విక్రమ్ సినిమాను తెరకెక్కించాడు. జూన్ 3న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఈ క్రమంలో లోకేష్ కనకరాజ్..రీసెంట్గా రామ్ చరణ్కు కథ వినిపించాడట. ఈ స్టోరీకి రామ్ చరణ్ ఇంప్రెస్ అయి..సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని టాక్. డైరెక్టర్ శంకర్ మూవీ పూర్తయ్యాక లోకేష్ కనకరాజ్ -రామ్ చరణ్ మూవీ సెట్స్పైకి వెళ్లనుందని తెలుస్తోంది.  ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ నిర్మించే అవకాశాలున్నాయని సమాచారం. 

మరిన్ని వార్తల కోసం

దిశ నిందితుల ఎన్కౌంటర్ బూటకం

ప్రధాని మోడీపై మాధవన్ ఆసక్తికర కామెంట్స్