చివరి అవకాశమివ్వండి.. అందరికీ మేలు చేస్తా : రామారావు పటేల్​

చివరి అవకాశమివ్వండి..  అందరికీ మేలు చేస్తా : రామారావు పటేల్​

భైంసా, వెలుగు: తాను పుట్టింది ముథోల్​ప్రజల కోసమేనని.. ఒక్కసారి ఎమ్మెల్యేగా గెలిపించి అసెంబ్లీకి పంపిస్తే అభివృద్ధితో పాటు అందరికీ మేలు చేస్తానని బీజేపీ ముథోల్ అభ్యర్థి రామారావు పటేల్ అన్నారు. శనివారం బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ అధ్యక్షతన భైంసాలో జరిగిన బహిరంగ సభలో రామారావు పటేల్​మాట్లాడుతూ బావోద్వేగానికి గురయ్యారు.

ప్రజలకు పాదాభివందనం చేశారు. తాను చనిపోయేంతవరకు బీజేపీతోనే ఉంటానన్నారు.  స్థానిక ఎమ్మెల్యే విఠల్​రెడ్డి పదేండ్ల కాలంలో నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదన్నారు. ముథోల్​ప్రజలకు మరింత సేవ చేసే ఛాన్స్​ఇవ్వాలని కోరారు. గోశాల అభివృద్ధికి పాటుపడుతానని హామీచ్చారు. 

బండి సంజయ్​రాకతో జోష్

బండి సంజయ్​ఆధ్వర్యంలో భైంసాలో జరిగిన ఎన్నికల ప్రచారానికి మంచి స్పందన లభించింది. సభకు యూత్​ భారీ సంఖ్యలో తరలివచ్చారు. లోకల్​సెంటిమెంట్​పై సంజయ్ ఎక్కువగా ఫోకస్​పెట్టారు. కేవలం ఓట్ల కోసమే కాంగ్రెస్, బీఆర్​ఎస్ పార్టీలు ముస్లింలను మోసం చేస్తూ వస్తున్నాయని ఆ వర్గాన్ని ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. బీజేపీ అధికారంలోకి రాగానే తాను ముథోల్​నియోజకవర్గాన్ని దత్తత తీసుకుంటానని ఈ సందర్భంగా ప్రకటించడంతో పార్టీ వర్గాల్లో నిండింది.