
బెంగళూరు: తెలంగాణ యంగ్స్టర్, నేషనల్ చాంపియన్ శ్రీవల్లి రష్మిక కెరీర్లో తొలి ఐటీఎఫ్ టైటిల్ను సాధించింది. ఆదివారం జరిగిన విమెన్స్ వరల్డ్ టెన్నిస్ టూర్ టోర్నీ ఫైనల్లో రష్మిక 6–0, 4–6, 6–3తో జీల్ దేశాయ్పై గెలిచింది. హోరాహోరీగా సాగిన మ్యాచ్లో ఇద్దరు చెరో సెట్ గెలిచారు.
అయితే డిసైడర్లో రష్మిక బలమైన సర్వ్లతో ఆకట్టుకుంది. 3–0 లీడ్తో సెట్ను మొదలుపెట్టిన తెలంగాణ ప్లేయర్ ఫోర్హ్యాండ్ షాట్లతో ప్రత్యర్థిపై పైచేయి సాధించింది. క్రాస్ కోర్టు రిటర్న్స్తో జీల్ను ముప్పు తిప్పలు పెట్టి విన్నర్గా నిలిచింది. విజేతగా నిలిచిన రష్మికకు రూ. 3 లక్షల 27 వేల ప్రైజ్మనీతో పాటు 50 డబ్ల్యూటీఏ పాయింట్స్ లభించాయి.