డాన్ శీను, బలుపు, క్రాక్ లాంటి హ్యాట్రిక్ హిట్స్ ఇచ్చిన దర్శకుడు గోపీచంద్ మలినేనితో నాలుగో సినిమా చేస్తున్నాడు రవితేజ. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా పవర్ఫుల్ కథను సిద్ధం చేశాడు గోపీచంద్. ఇటీవల ఇచ్చిన అనౌన్స్మెంట్ పోస్టర్తోనే సినిమాపై ఆసక్తిని పెంచారు. తాజాగా ఈ మూవీకి సంబంధించి మరిన్ని అప్డేట్స్ను ప్రకటించారు.
ఇందులో వెర్సటైల్ యాక్టర్ సెల్వరాఘవన్ కీలక పాత్ర పోషిస్తున్నట్లు తెలియజేసిన మేకర్స్.. అలాగే టెక్నీషియన్స్ను కూడా పరిచయం చేశారు. తమన్ సంగీతం అందిస్తున్నట్టు, జీకే విష్ణు సినిమాటోగ్రాఫర్గా, ఏఎస్ ప్రకాష్ ఆర్ట్ డైరెక్టర్గా, నవీన్ నూలి ఎడిటర్గా వర్క్ చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ సందర్భంగా రవితేజ, గోపీచంద్ మలినేనితో పాటు నిర్మాతలు నవీన్ యెర్నేని, వై రవిశంకర్ బ్లాక్ అండ్ బ్లాక్ డ్రెస్సులో ఫొటోకు స్టిల్ ఇచ్చారు.
అలాగే సర్ప్రైజింగ్ స్టార్ కాస్ట్ ఇందులో ఉండనుందని తెలియజేశారు. ఇదిలా ఉంటే.. అమర్ అక్బర్ ఆంటోని, వాల్తేరు వీరయ్య తర్వాత మైత్రీ సంస్థలో రవితేజ నటిస్తున్న మూడో చిత్రమని, గోపీచంద్ డైరెక్షన్లో నాలుగో సినిమా అని రవితేజ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.