మాస్​రాజా దూకుడు

మాస్​రాజా దూకుడు

కెరీర్ స్టార్ట్ చేసి ముప్ఫయేళ్లు దాటినా ఏ మాత్రం స్పీడ్ తగ్గకుండా ఒకేసారి మూడు, నాలుగు సినిమాల్లో నటిస్తుంటాడు రవితేజ. ఇటీవల ‘ధమాకా’తో బ్లాక్ బస్టర్‌‌‌‌‌‌‌‌ అందుకుని, వంద కోట్ల క్లబ్‌‌‌‌లో చేరాడు. అలాగే ‘వాల్తేరు వీరయ్య’లో కీలక పాత్ర పోషించి సక్సెస్ అందుకున్నాడు. మరోవైపు ‘రావణాసుర’, ‘టైగర్ నాగేశ్వరరావు’ చిత్రాల షూటింగ్స్‌‌‌‌లో పాల్గొంటూ బిజీగా ఉన్న మాస్ రాజా రవితేజ ఇప్పుడు మరింత దూకుడు పెంచాడు. ఆల్రెడీ రెండు చిత్రాల్లో నటిస్తూనే  మరో ఇద్దరు యంగ్ డైరెక్టర్స్‌‌‌‌కి  ఓకే చెప్పాడనే టాక్ వినిపిస్తోంది. వారిలో ఒకరు సినిమాటోగ్రాఫర్ కార్తీక్ ఘట్టమనేని కాగా, మరొకరు ప్రశాంత్ వర్మ అని తెలుస్తోంది.

ప్రశాంత్ వర్మ చెప్పిన కథ  బాగా నచ్చడంతో వెంటనే స్ర్కిప్ట్‌‌‌‌ వర్క్ స్టార్ట్ చేయడానికి  గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట రవితేజ.  ప్రెజెంట్ ‘హను-మాన్’ తెర కెక్కిస్తున్న ప్రశాంత్ వర్మ అది రిలీజ్ అవ్వగానే రవితేజ సినిమాపైనే వర్క్ మొదలుపెట్టనున్నట్టు తెలుస్తోంది. ఈ ప్రాజెక్టులపై అధికారిక ప్రకటన రావాల్సి  ఉంది.