మాస్క్ పెట్టుకోనివాళ్లు, మందిలో తిరిగేవాళ్లలో చాలామంది రీ–ఇన్ఫెక్షన్ బారిన పడుతున్నారు. అయితే, వ్యాక్సిన్ రెండు డోసులు వేసుకున్నవాళ్లకు, బూస్టర్ డోస్ తీసుకున్నవాళ్లకు కూడా కరోనా రీ–ఇన్ఫెక్షన్ వస్తోంది. తొందరగా, ఈజీగా వ్యాపించే ఒమిక్రాన్తో పాటు ఇమ్యూనిటీ తగ్గడం కూడా కారణం. కరోనా నుంచి కోలుకున్నవాళ్లలో యాంటీబాడీస్ దాదాపు ఐదు నెలలు యాక్టివ్గా ఉంటాయి. ఆ తర్వాత ఇమ్యూనిటీ తగ్గుతుంది. దాంతో ఈ కొత్త వేరియెంట్ వేగంగా వ్యాపిస్తోంది. అయితే, ఒమిక్రాన్ రీ–ఇన్ఫెక్షన్ గురించి సైంటిఫిక్ డేటా ఇంకా రాలేదు.
రీ–ఇన్ఫెక్షన్ రాకుండా...
ఆఫీసు లేదా ఇతర పనులకు బయటికి వెళ్లేవాళ్లు కరోనా జాగ్రత్తలు పాటించాలి. 15 ఏండ్లు దాటిన వాళ్లతో సహా ఇంట్లోవాళ్లందరూ వ్యాక్సిన్ వేసుకోవాలి. రెండో డోస్ వేసుకున్న 9 నెలల తర్వాత బూస్టర్ డోస్ వేసుకోవాలి. అయితే, డాక్టర్ని సంప్రదింతించిన తర్వాత వేసుకుంటే మంచిది. కరోనా వచ్చి, హోమ్ ఐసోలేషన్లో ఉండేవాళ్లు ఇంట్లోవాళ్లకి 6 అడుగుల దూరం ఉండాలి. అంతేకాదు ఇంట్లోనే ఉన్నాకూడా ఫ్యామిలీ అంతా మాస్క్ పెట్టుకోవాలి.
ఇమ్యూనిటీ కోసం...
కరోనా టైమ్లో శారీరకంగా, మానసికంగా బలంగా ఉండడం చాలా ముఖ్యం. అందుకోసం రోజూ వర్కవుట్స్తో పాటు కొంచెం సేపు యోగ, ధ్యానం చేయాలి. ఇమ్యూనిటీ కోసం వంటల్లో పసుపు, నల్లమిరియాలు, అల్లం, వెల్లుల్లి, లవంగాలు వంటి మసాలా దినుసులు తప్పనిసరిగా వేయాలి. నిమ్మజాతి పండ్లు, నట్స్, ఆకుకూరలు, డ్రై ఫ్రూట్స్ కూడా ఇమ్యూనిటీని పెంచుతాయి. కెఫిన్ ఉండే కాఫీ లాంటి డ్రింక్స్ బదులు హెర్బల్ టీ తాగితే హెల్త్కి మంచిది. కరోనా నుంచి కోలుకున్నవాళ్లు బ్రీతింగ్ కెపా సిటీ పెంచుకోవడానికి ఎక్సర్సైజ్లు చేయాలి.
ఇవి కూడా చదవండి: