Virat Kohli: బ్యాడ్ న్యూస్.. రాజ్‌కోట్, రాంచీ టెస్టులకు కోహ్లీ దూరం

Virat Kohli: బ్యాడ్ న్యూస్.. రాజ్‌కోట్, రాంచీ టెస్టులకు కోహ్లీ దూరం

భారత క్రికెట్ అభిమానులకు బ్యాడ్ న్యూస్ అందుతోంది. స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ ఇంగ్లాండ్ సిరీస్ మొత్తానికి దూరం కానున్నారని సమాచారం. వ్యక్తిగత కారణాల రీత్యా తొలి రెండు టెస్టులకు దూరమైన కోహ్లీ.. మూడు, నాలుగో టెస్టులకు కూడా అందుబాటులో ఉండే అవకాశం లేదని ప్రముఖ క్రికెట్ వెబ్‌సైట్ కథనాన్ని ప్రచురించింది. చివరి టెస్ట్ సమయానికి అతడు జట్టుతో కలవనున్నట్లు పేర్కొన్నప్పటికీ దానిపైనా స్పష్టత లేదు.

చివరి మూడు టెస్టులకు బీసీసీఐ.. భారత జట్టును బీసీసీఐ ప్రకటించాల్సి ఉంది. మంగళవారమే భారత జట్టును ప్రకటిస్తారని  ప్రచారం జరిగినప్పటికీ.. కోహ్లీ అందుబాటులోకి వచ్చే విషయపై క్లారిటీ లేకపోవడంతో ఆలస్యమవుతున్నట్లు సమాచారం. ఒకవేళ కోహ్లీ మూడు, నాలుగో టెస్టులకు కూడా దూరమైతే అతని స్థానంలో జట్టులోకి వచ్చిన యువ ఆటగాడు రజిత్ పటీదార్‌నే కొనసాగించే అవకాశం ఉంది.

రెండో బిడ్డకు జన్మనివ్వనున్న అనుష్క

కోహ్లీ సతీమణి అనుష్క శర్మ రెండో బిడ్డకు జన్మనివ్వనున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే అతను తొలి రెండు టెస్టులకు దూరంగా ఉన్నాడు. డెలివరీ సమయంలో ఆమె పక్కన ఉండాలనే ఉద్దేశ్యంతో కోహ్లీ ఈ నిర్ణయం తీసుకున్నాడు. బీసీసీఐ అనుమతితోనే  టెస్ట్ సిరీస్ నుంచి తప్పుకున్నాడు.

కాగా, గాయాలతో రెండో టెస్టుకు దూరమైన కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా మూడో టెస్టుకు జట్టుతో కలవనున్నారు.