ట్రిపుల్‌‌‌‌ రైడింగ్​కు రూ.1200..రాంగ్ రూట్​లో వెళ్తే రూ.1700

ట్రిపుల్‌‌‌‌ రైడింగ్​కు రూ.1200..రాంగ్ రూట్​లో వెళ్తే రూ.1700

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: సిటీలో ట్రాఫిక్ జరిమానాలను సవరించినట్లు ట్రాఫిక్ చీఫ్ ఏవీ రంగనాథ్ శనివారం ఓ ప్రకటకలో తెలిపారు. రోడ్డు ప్రమాదాలు, ప్రాణ నష్టం నివారణ కోసం సీరియస్ యాక్షన్ తీసుకుంటున్నట్లు ఆయన చెప్పారు. రాంగ్ రూట్​లో డ్రైవింగ్‌‌‌‌, ట్రిపుల్‌‌‌‌ రైడింగ్‌‌‌‌ చేసే వారిపై భారీ జరిమానాలు విధించనున్నామన్నారు. మోటార్‌‌‌‌‌‌‌‌ వెహికల్‌‌‌‌ యాక్ట్‌‌‌‌  ప్రకారం రాంగ్‌‌‌‌ సైడ్‌‌‌‌ డ్రైవింగ్‌‌‌‌ చేసే వారికి రూ.1,700, ట్రిపుల్‌‌‌‌ రైడింగ్‌‌‌‌ చేసే వారికి రూ.1,200 ఫైన్ వేయనున్నట్లు ఆయన తెలిపారు. సోమవారం నుంచి ఈ నెల 27 వరకు అన్ని ట్రాఫిక్ ​జంక్షన్లలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించి.. 28 నుంచి స్పెషల్‌‌‌‌ డ్రైవ్ చేపడతామని ఆయన చెప్పారు.