
మల్లాపూర్, వెలుగు: ట్రాక్టర్ బోల్తా పడి వ్యక్తి మృచెందిన ఘటన జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం రాఘవపేటలో జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన చెదిలి ప్రవీణ్ (30) గురువారం ట్రాక్టర్ సాయంతో తన పొలాన్ని దున్నుతున్నాడు. ఈక్రమంలో ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తాపడింది. ట్రాక్టర్ కింద చిక్కుకున్న ప్రవీణ్ స్పాట్లోనే చనిపోయాడు. తండ్రితోపాటు శ్రీహన్(12) ట్రాక్టర్పై ఉండగా, అతడి కాలువిరిగింది. వారిని సమీప రైతులు మెట్పల్లి ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి, విచారణ చేపట్టారు.