
పెబ్బేరు, వెలుగు: మండలంలోని కంచిరావుపల్లి తండాలో శుక్రవారం రాత్రి దొంగలు హల్చల్ చేశారు. తాళం వేసి ఉన్న నాలుగు ఇండ్లల్లో దొంగలు పడి1.10 కిలోల వెండి, ఒకటిన్నర తులాల బంగారు ఆభరణాలు చోరీ చేసినట్లు ఎస్సై యుగంధర్ రెడ్డి తెలిపారు. గ్రామానికి చెందిన రాత్లావత్ వినాయక్ ఇంటిలో బీరువా పగులగొట్టి ఒకటిన్నర తులాల బంగారు కమ్మలు, ఉంగరం, 40 తులాల వెండి కడియాలు ఎత్తుకెళ్లారు.
రాత్లావత్ జమ్మలమ్మ ఇంటి తాళం పగులగొట్టి బీరువాలోని 70 తులాల వెండిని దొంగిలించారు. పీరియా నాయక్ ఇంటిలోని గల్లా పెట్టెను ఎత్తుకెళ్లారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని క్లూస్ టీంతో ఆధారాలు సేకరించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.