చెన్నూరు, వెలుగు: పట్టణంలోని రోడ్లు, డ్రైనేజ్ వ్యవస్థను పూర్తిగా మార్చేందుకు రాష్ట్ర కార్మిక, గనుల శాఖ మంత్రి జి.వివేక్వెంకటస్వామి రూ.18 కోట్లు కేటాయించారని కాంగ్రెస్పట్టణ అధ్యక్షుడు చెన్న సూర్యనారాయణ, సీనియర్నాయకుడు హేమంత్రెడ్డి తెలిపారు. ఈ మేరకు మంగళవారం 16 వ వార్డులోని గెర్రె కాలనీలో మున్సిపల్ అధికారులు సర్వే నిర్వహించారని పేర్కొన్నారు. బీఆర్ఎస్హయాంలో చెన్నూరు మున్సిపాలిటీలో ఎలాంటి అభివృద్ధి పనులు చేయలేదని ఆరోపించారు.
మంత్రి వివేక్ వెంకటస్వామి చెన్నూరు ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత పట్టణంలో రోడ్లు, డ్రైనేజీల వంటి అభివృద్ధి పనులపై ఫోకస్పెట్టారని చెప్పారు. ఎన్నికల సమయంలో రోడ్లపై మురుగునీరు, చెత్త లేకుండా పరిశుభ్రమైన మున్సిపాలిటీగా మార్చేందుకు కృషి చేస్తానని ఇచ్చిన హామీ మేరకు ప్రస్తుతం నిధులు మంజూరు చేశారని పేర్కొన్నారు.
