
చేగుంట, వెలుగు: చేగుంట -మెదక్ రూట్లో రైల్వే క్రాసింగ్దగ్గర రైల్వే ఓవర్ బ్రిడ్జ్ (ఆర్వోబీ) నిర్మాణానికి రూ.45 కోట్లు మంజూరయ్యాయని ఎంపీ రఘునందన్రావు తెలిపారు. సోమవారం ఆయన చేగుంటలో మీడియాతో మాట్లాడుతూ చేగుంట రైల్వే క్రాసింగ్ దగ్గర తరచూ గేట్ పడుతుండడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారన్నారు.
ఈ నేపథ్యంలో వాహనదారులు ఆర్వోబీ నిర్మించాలని ఎప్పటి నుంచో కోరుతున్నారని, ఇప్పుడు నిధులు మంజూరైనందున త్వరలో టెండర్ ప్రక్రియ పూర్తిచేసి ప్రజలకు ఇచ్చిన హామీని 18 నెలలలోనే నెరవేరుస్తామన్నారు. ఈ సందర్భంగా చేగుంట మండల బీజేపీ అధ్యక్షుడు ఎల్లారెడ్డి, మాజీ అధ్యక్షుడు భూపాల్, ఓబీసీ కార్యవర్గ సభ్యుడు గణేశ్, చంద్రశేఖర్, వెంకటేశ్, నర్సింలు ఉన్నారు.