ఎయిరిండియా విమాన బాధితులకు భారత సంతతి డాక్టర్ రూ.6 కోట్ల ఆర్థిక సహయం

ఎయిరిండియా విమాన బాధితులకు భారత సంతతి డాక్టర్ రూ.6 కోట్ల ఆర్థిక సహయం

దుబాయ్: ఎయిరిండియా విమాన బాధితులకు యూఏఈలో నివసిస్తున్న ఇండియన్ డాక్టర్ రూ.6 కోట్ల ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు. విమాన ప్రమాదంతో ప్రభావితమైన మెడికల్ స్టూడెంట్లు, డాక్టర్ల కుటుంబాలకు ఈ మొత్తాన్ని అందించనున్నట్టు తెలిపారు. బుర్జిల్ హోల్డింగ్స్ వ్యవస్థాపకుడు, చైర్మన్, వీపీఎస్ హెల్త్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ షంషీర్ యూఏఈ నుంచి ఈ సహాయ ప్యాకేజీని ప్రకటించారు. ప్రమాదంలో చనిపోయిన నలుగురు విద్యార్థుల కుటుంబాలకు రూ.కోటి చొప్పున, తీవ్రంగా గాయపడిన ఐదుగురు విద్యార్థులకు  రూ.20 లక్షల చొప్పున అందించనున్నారు.

డాక్టర్ల కుటుంబాలకు రూ.20 లక్షల చొప్పున ఆర్థిక సహాయం ఇవ్వనున్నారు. బీజే మెడికల్ కాలేజీలోని జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ ద్వారా ఈ సాయాన్ని అందించనున్నారు. విమాన ప్రమాదం తనను తీవ్రంగా కలచి వేసిందని డాక్టర్ షంషీర్ తెలిపారు. మంగళూరులోని కస్తూర్బా మెడికల్ కాలేజీ, చెన్నైలోని శ్రీ రామచంద్ర మెడికల్ కాలేజీలో చదువుకుంటున్నప్పుడు ఇలాంటి హాస్టళ్లలో నివసించిన వ్యక్తిగా ఆ దృశ్యాలు తనను  తీవ్రంగా కదిలించాయని చెప్పారు.