కేసీఆర్ ఫామ్ హౌస్ లో డంపింగ్ యార్డులు, స్మశాన వాటికలు కడితే ఊరుకుంటారా..? : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

కేసీఆర్ ఫామ్ హౌస్ లో డంపింగ్ యార్డులు, స్మశాన వాటికలు కడితే ఊరుకుంటారా..? :  ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

బీఎస్పీ పార్టీ తెలంగాణ రాష్ర్ట అధ్యక్షులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మరోసారి తెలంగాణ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. GO 46ను సవరించాలని డిమాండ్ చేశారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్, TSPSC పేపర్ లీకేజీ, ఎమ్మె్ల్యేల భూ కబ్జాలు, భారీ వర్షాలు, వరదలపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు. 

దాదాపు 30 రోజులకు పైగా ధర్నాలు చేస్తున్న పంచాయతీ కార్మికులను కేసీఆర్ ఎందుకు పట్టించుకోవడం లేదన్నారు. కేసీఆర్, కేటీఆర్, కవిత ఫామ్ హౌస్ లలో డంపింగ్ యార్డులు, స్మశాన వాటికలు కడితే ఊరుకుంటారా..? అని ప్రశ్నించారు. గత ప్రభుత్వాలు పేదలకు ఇచ్చిన భూములను గుంజుకుని వాటిల్లో స్మశాన వాటికలు, డంపింగ్ యార్డులు ఎందుకు కడుతున్నారని ప్రశ్నించారు.