యుద్ధంలో తొలిదశ పూర్తైందన్న పుతిన్ సేనలు

యుద్ధంలో తొలిదశ పూర్తైందన్న పుతిన్ సేనలు

ఉక్రెయిన్ పై  చేపట్టిన  సైనిక చర్యలో  మొదటి దశ  పూర్తయ్యిందని  తెలిపింది రష్యా రక్షణశాఖ. ప్రస్తుతం ఈస్ట్  ఉక్రెయిన్ లోని   డాన్ బాస్ ప్రాంత  స్వాధీనంపై  రష్యా దృష్టి సారిస్తుందని తెలిపింది. ఉక్రెయిన్ లో  చేపడుతున్న ప్రత్యేక  ఆపరేషన్  విషయంలో 2 ఆప్షన్ లను పరిశీలిస్తున్నామంది  రష్యా రక్షణ శాఖ.  ఒకటి.. డాన్ బాస్ లోని  వేర్పాటువాద ప్రాంతాల్లోనే దాడులు చేయడం.  మరొకటి.. ఉక్రెయిన్  మొత్తానికి  విస్తరించడం అని స్పష్టం చేసింది. 93 శాతం  లుహాన్స్ కు,  54 శాతం డొనెట్స్ కు  రీజియన్ లు  రష్యా నియంత్రణలో ఉన్నాయని తెలిపారు రష్యా సాయుధ  దళాల జనరల్  స్టాఫ్  ప్రతినిధి సెర్గీ.  ఉక్రెయిన్ వైమానిక, నావికా దళాల్లోని  అత్యధిక భాగాన్ని  తమ బలగాలు  నాశనం చేశాయని.. దీంతో  మొదటి దశ సైనిక చర్య విజయవంతంమైందన్నారు.  సైనిక చర్య పేరుతో  ఫిబ్రవరి 24 నుంచి  ఉక్రెయిన్ పై భీకర దాడులు చేస్తుంది  రష్యా. అనేక దేశాలు రష్యాను వ్యతిరేకిస్తూ మాస్కోపై కఠిన ఆంక్షలు విధిస్తున్నా పుతిన్  సర్కారు వెనక్కి తగ్గట్లేదు.
 
ఈనెల 16న  మరియుపోల్ లోని   ఓ థియేటర్ పై  రష్యా జరిపిన దాడిలో అక్కడ ఆశ్రయం పొందుతున్న సుమారు  300 మంది చనిపోయినట్లు  తెలిపారు ఉక్రెయిన్ అధికారులు. ప్రత్యక్ష సాక్షులు చెప్పిన వివరాలతో  టెలిగ్రాం ఛానెల్  ద్వారా  ఈ వివరాలను అందించారు స్థానిక అధికారులు. చాలామంది చిన్నారులు ఈ థియేటర్ లో ఆశ్రయం పొందుతున్నారని... వారిని కాపాండేందుకు  చిల్డ్రన్ అని   రష్యన్ భాషలో  బోర్డుపెట్టామని  తెలిపింది ఉక్రెయిన్ ప్రభుత్వం. దాడుల్లో ఇళ్లు  ధ్వంసమైన  1,300 మంది  కూడా ఇక్కడే  ఉన్నారని... ఈ శిబిరంపై దారుణంగా పుతిన్ సేనలు  దాడులు చేశాయని  ఆవేదన వ్యక్తం చేశారు ఉక్రెయిన్  పార్లమెంటుకు చెందిన మానవ హక్కుల  కమిషనర్  లుడ్మిలా డెనిసోవా.

మరిన్ని వార్తల  కోసం

 

ఉగాది తర్వాత వడ్ల ఉద్యమం

ఐదుసార్లు అవమానించినా భరించినం