ఉప్పర్ గూడ యాదవ సంఘం ఆధ్వర్యంలో..పాత బస్తీలో సదర్ మేళా

ఉప్పర్ గూడ యాదవ సంఘం ఆధ్వర్యంలో..పాత బస్తీలో సదర్ మేళా

హైదరాబాద్: యాదవులు ప్రతిష్టాత్మకంగా జరుపుకునే సదర్​ మేళాను పాతబస్తీలో మంగళవారం (అక్టోబర్​21) ఉప్పర్​ గూడ యాదవ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. దీపావళి పండుగ సందర్బంగా యాదవులు జరుపుకునే అతిపెద్ద ఉత్సవం సదర్ ను పాతబస్తీలో చంచల్ గూడ జైల్​సమీపంలోని సౌత్​ ఈస్ట్​ జోన్​  డీసీపీ కార్యాలయం సెంటర్​ లో బ్యాండు, బాజాలతో డప్పు సప్పుల్లతో ఘనంగా నిర్వహించారు. సదర్ మేళా కు హాజరైన మాజీ హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ హాజరయ్యారు. 

సదర్​ ఉత్సవాలకు చారిత్రక నేపథ్యం ఉంది. నిజాం ప్రభుత్వ కాలంనుంచి యాదవులు దీపావళి మరుసటి రోజున ఈ సదర్​ ఉత్సవాలను నిర్వహిస్తున్నారు. ప్రతియేటా మాదిరిగానే ఈ సంవత్సరం కూడా  ఉప్పర్​ గూడ యాదవ సంఘం సదర్​ ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాటు చేసింది.  సదర్​ ఉత్సవాల్లో యాదవుల సంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమాలను తిలకించేందుకు  పెద్ద ఎత్తున్న ప్రజలు తరలివచ్చాయి. సదర్​ ఉత్సవాల సందర్భంగా ఎటువంటి ట్రాఫిక్​ సమస్యలు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేశారు ట్రాఫిక్​ పోలీసులు. 

►ALSO READ | వాహనదారులకు బిగ్ అలర్ట్: హైదరాబాద్‎లో రేపు (అక్టోబర్ 22) ఈ ఏరియాల్లో ట్రాఫిక్ ఆంక్షలు