గురుగ్రామ్: ఐటీఎఫ్ విమెన్స్ ఓపెన్లో తెలుగమ్మాయి సహజ యమలాపల్లి క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించింది. గురువారం జరిగిన ప్రిక్వార్టర్స్లో సహజ 7–6 (8), 7–5తో రియా భాటియాపై గెలిచింది. తొలి గేమ్లో రియా అటాకింగ్ గేమ్తో చెలరేగింది. బలమైన రిటర్న్స్తో ఆకట్టుకుంది. దీంతో 5–3 లీడ్లో నిలిచింది. అయితే 10వ గేమ్లో రియా మూడు డబుల్ ఫాల్ట్స్ చేయడంతో సహజ పుంజుకుంది. సర్వీస్లను నిలబెట్టుకోవడంతో ఆధిక్యం చేతులు మారింది. చివరకు టైబ్రేక్లో సహజ సెట్ను సాధించింది.
రెండో సెట్లో తొలి 3 గేమ్స్లో సహజ ఒకటి కోల్పోయింది. రియా వరుసగా మూడు గేమ్లు నెగ్గడంతో 4–3 లీడ్లోకి వచ్చింది. తర్వాత ఇరువురు సర్వీస్లు నిలబెట్టుకోవడంతో 5–5తో స్కోరు సమమైంది. 11వ గేమ్లో బ్రేక్ పాయింట్ సాధించిన సహజ తర్వాతి గేమ్నూ సొంతం చేసుకుంది. మరో మ్యాచ్లో రష్మిక శ్రీవల్లి భమిడిపాటి 1–6, 6–3, 7–6 (5)తో జాక్వెలినా కాబజ్ అవద్ (స్వీడన్) చేతిలో ఓడింది.