న్యూఢిల్లీ: కరోనా కంటిన్యూ అవుతూనే ఉన్నప్పటికీ, దేశమంతటా స్మార్ట్ఫోన్ల అమ్మకాల జోరు కొనసాగుతూనే ఉంది. కంపెనీలు పంపే షిప్మెంట్లు (కంపెనీల నుంచి సెల్లర్లకు వెళ్లే యూనిట్లు) గత ఏడాది భారీగా పెరిగాయి. మార్కెట్ రీసెర్చ్ ఫర్మ్ కౌంటర్పాయింట్ రీసెర్చ్ ప్రకారం.. సప్లై చెయిన్ ఇబ్బందులు, ధరల పెరుగుదల వంటి సమస్యలు ఉన్నప్పటికీ ఇండియా స్మార్ట్ఫోన్ మార్కెట్ 2021లో దూసుకెళ్లింది. ఏకంగా 169 మిలియన్ల షిప్మెంట్లను (16.9 కోట్లు) రికార్డు చేసింది. 2020 లో జరిగిన షిప్మెంట్లతో పోలిస్తే ఇవి11శాతం ఎక్కువ. 5జీ స్మార్ట్ఫోన్లకు డిమాండ్ పెరగడం భారీ గ్రోత్కు కారణమని సంస్థ పేర్కొంది. 2021లో మొత్తం షిప్మెంట్లలో 5జీ ఫోన్ల వాటా17శాతం వరకు ఉంది. 2020 తో పోలిస్తే ఆరు రెట్లు గ్రోత్ రికార్డు అయింది. ‘‘ మిడ్ -టు -హై-ఎండ్ 5జీ స్మార్ట్ఫోన్ల అమ్మకాలు చాలా బాగున్నాయి. ఇక నుంచి కూడా ఈ విభాగం మార్కెట్ రెండంకెల గ్రోత్ను కొనసాగిస్తుందని ఆశించవచ్చు’’ అని కౌంటర్ పాయింట్ ఎనలిస్టు ఒకరు చెప్పారు. దాదాపు అన్ని కంపెనీలకు మార్కెట్ అవకాశాలను ఇచ్చిందని, అమ్మకాలను పెంచుకున్నాయని అన్నారు. కంపెనీల మధ్య తీవ్రమైన పోటీ, చౌకగా 5జీ చిప్సెట్లు అందుబాటులోకి రావడం వల్ల ఈ ఏడాది 5జీ ఫోన్ల ధరలు మరింత తగ్గుతాయి. మరిన్ని మోడల్స్ వస్తాయి. 2021లో జూన్ నుంచి డిసెంబరు వరకు ఎంట్రీ-లెవల్ 5జీ ఫోన్ల ధర 40 శాతానికి తగ్గింది. దీనివల్ల ఎక్కువ మంది 5జీ స్మార్ట్ఫోన్లు కొన్నారు. ఈ ప్రైస్ బ్యాండ్లలోని షిప్మెంట్లు సంవత్సర కాలానికి 96 శాతానికి పెరిగాయి. రూ.20 వేల కంటే ఎక్కువ ధరలు ఉన్న ఫోన్లకు కస్టమర్ల నుంచి డిమాండ్ బాగుంది. వీటి రిటైల్ సగటు అమ్మకపు ధరలు13శాతానికి పైగా పెరిగాయి. చాలా మంది పాత ఫోన్లను వదిలేసి కొత్తగా ప్రీమియం ఫోన్లు కొన్నారని కౌంటర్ పాయింట్ రీసెర్చ్ రిపోర్టు వివరించింది. మొత్తం షిప్మెంట్లలో 47 శాతం ఫోన్లు రూ. 10 వేలు–రూ. 20 వేల మధ్య ధర కలిగినవి ఉన్నాయి. రూ. 10 వేల కంటే తక్కువ ధర ఉన్నవాటి షిప్మెంట్ల మార్కెట్ వాటా ఐదు శాతం తగ్గింది. కాలం గడిచేకొద్దీ భారతీయులు తమ స్మార్ట్ఫోన్లపై ఎక్కువ ఖర్చుపెడుతున్నారనే దానికి ఈ షిప్మెంట్లు రుజువని కౌంటర్ పాయింట్ రిపోర్టు పేర్కొంది.
5జీ ఫోన్లకు పెరిగిన డిమాండ్
- బిజినెస్
- January 22, 2022
లేటెస్ట్
- ఆర్బీఐ ఆంక్షలు: PhonePe, Google Pay ట్రాన్జక్షన్లపై లిమిట్
- చిక్కుల్లో ఎయిర్ ఇండియా ఎక్సప్రెస్.. విమానాల రద్దుపై ప్రభుత్వం సీరియస్
- పిటిషన్ వేసినందుకు లక్ష రూపాయలు ఫైన్ వేసిన కోర్టు
- IPL 2024: ధోనీ, కోహ్లీ ఆల్టైం రికార్డ్ బ్రేక్.. ఐపీఎల్లో సంజు శాంసన్ అరుదైన ఘనత
- యువతను మోసం చేసి బీజేపీ రెండు సార్లు గద్దెనెక్కింది : విజయరమణారావు
- గడ్డం వంశీకృష్ణను గెలిపిస్తే పెద్దపల్లి అభివృద్ధి చెందుతుంది : పురాణం సతీశ్ కుమార్
- బై మిస్టేక్లో రేవంత్ రెడ్డి సీఎం అయ్యిండు : కిషన్ రెడ్డి
- జూన్ 5న కాంగ్రెస్ లోకి 25 మంది ఎమ్మెల్యేలు : కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
- అదాని, అంబానీ జపం బంద్.. ఎన్నికల నోటిఫికేషన్ రాగానే కాంగ్రెస్ తీరు మారింది : మోదీ
- జేపీ నడ్డాకు బిగ్ షాక్.. కర్ణాటక పోలీసులు సమన్లు
Most Read News
- బేగంపేట నాళాలో కొట్టుకొచ్చుని డెడ్బాడీలు
- Good Health : మీకు గ్యాస్ ప్రాబ్లమ్ ఉందా.. కారణాలు ఇవే.. లక్షణాలు ఇలా.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..!
- ఎండాకాలంలో హైదరాబాద్లో రికార్డు వర్షం
- కలికాలం.. భోజనంలో స్వీట్స్ లేవని.. పెళ్లి రద్దు..
- చల్లబడిన వాతావరణం.. మూడు రోజుల పాటు తెలంగాణలో వర్షాలు..
- బెంగళూరులోనూ మొదలైందా : మెట్రోలో యంగ్ కపుల్ రొమాంటిక్ సీన్స్
- KIA EV3 ఎలక్ట్రిక్ SUVను మే 23న లాంఛింగ్
- చికెన్ షవర్మా తిని 19 ఏళ్ల యువకుడు మృతి
- భారీ వర్షం.. యాదాద్రి ఆలయంలో కొట్టుకుపోయిన చలువపందిళ్లు, రేకుల షెడ్డు
- Ranveer, Deepika: విడాకుల బాటలో మరో బాలీవుడ్ జంట.. క్లారిటీ వచ్చేసింది!