నరిష్​ యూలో  ఇన్వెస్ట్​ చేసిన సమంత

నరిష్​ యూలో  ఇన్వెస్ట్​ చేసిన సమంత

హైదరాబాద్​, వెలుగు:   తమ సంస్థలో  ప్రముఖ  నటి  సమంత రూత్​ప్రభు ఇన్వెస్ట్​ చేసినట్టు సూపర్‌‌‌‌‌‌‌‌ఫుడ్‌‌‌‌‌‌‌‌ స్టార్టప్‌‌‌‌‌‌‌‌ నరిష్‌‌‌‌‌‌‌‌ యూ వెల్లడించింది.   తాము క్వినోవా,  చియా సీడ్స్‌‌‌‌‌‌‌‌ వంటి మిల్లెట్​ ఫుడ్స్​ను అమ్ముతున్నామని పేర్కొంది. స్థానికంగా సేకరించిన  సస్టెయినబల్‌‌‌‌‌‌‌‌ సూపర్‌‌‌‌‌‌‌‌ఫుడ్స్‌‌‌‌‌‌‌‌ను కూడా తమ నుంచి కొనుక్కోవచ్చని వెల్లడించింది. సీడ్‌‌‌‌‌‌‌‌ ఫండింగ్‌‌‌‌‌‌‌‌ రౌండ్‌‌‌‌‌‌‌‌లో భాగంగా  సమంత ఇన్వెస్ట్​ చేశారు. ఈ సందర్భంగా మొక్కల ఆధారిత మిల్లెట్‌‌‌‌‌‌‌‌ మిల్క్‌‌‌‌‌‌‌‌ను లాంచ్​చేశారు.   ట్రయంప్‌‌‌‌‌‌‌‌ గ్రూప్‌‌‌‌‌‌‌‌కు చెందిన జనార్ధన రావు, డార్విన్‌‌‌‌‌‌‌‌ బాక్స్‌‌‌‌‌‌‌‌ కో–ఫౌండర్‌‌‌‌‌‌‌‌ రోహిత్‌‌‌‌‌‌‌‌ చెన్నమనేని,  జెరోధా  కో–ఫౌండర్‌‌‌‌‌‌‌‌ నిఖిల్‌‌‌‌‌‌‌‌ కామత్‌‌‌‌‌‌‌‌, గృహాస్‌‌‌‌‌‌‌‌ ప్రాప్‌‌‌‌‌‌‌‌టెక్‌‌‌‌‌‌‌‌ కో–ఫౌండర్‌‌‌‌‌‌‌‌ అభిజిత్‌‌‌‌‌‌‌‌ పాయ్‌‌‌‌‌‌‌‌, కిమ్స్‌‌‌‌‌‌‌‌ హాస్పిటల్స్‌‌‌‌‌‌‌‌ సీఈఓ అభినయ్‌‌‌‌‌‌‌‌ బొల్లినేని వంటి వారు  నరిష్‌‌‌‌‌‌‌‌ యూలో పెట్టుబడులు పెట్టారు.