హమాలీ వర్కర్స్​ వెల్ఫేర్​ బోర్డు ఏర్పాటు చేయాలి : సామ్రాజ్యం

హమాలీ వర్కర్స్​ వెల్ఫేర్​ బోర్డు ఏర్పాటు చేయాలి : సామ్రాజ్యం

బోధన్, వెలుగు: మాట ఇచ్చిన ప్రకారం కాంగ్రెస్​ ప్రభుత్వం హమాలీల కోసం హమాలీ వర్కర్స్​ వెల్పేర్​ బోర్డును ఏర్పాటు చేయాలని ఆ యూనియన్​ రాష్ట్ర అధ్యక్షుడు సామ్రాజ్యం డిమాండ్ చేశారు. ఆదివారం బోధన్​లోని గంజ్​లో హమాలీ  నాయకులు, కూలీల జిల్లా స్థాయి సమావేశం నిర్వహించారు. సామ్రాజ్యం మాట్లాడుతూ హమాలీలకు భద్రత కల్పించాలని, సమాన పనికి సమాన వేతనం, గుర్తింపు కార్డులు ఇవ్వాలని డిమాండ్​చేశారు.

తమ సమస్యలు పరిష్కరిస్తామని కాంగ్రెస్​పార్టీ ఎన్నికల టైమ్​లో హామీ ఇచ్చినట్లు గుర్తుచేశారు. నిజామాబాద్​ జిల్లాలో 600 మంది హమాలీలు సభ్యత్వం తీసుకున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో బోధన్​హమాలీ వర్కర్స్ యూనియన్ ​ప్రెసిడెంట్​కనిగంటి శ్రీనివాస్​రావు, ఉపాధ్యక్షుడు హనుమంతప్ప పాల్గొన్నారు.