10వ తేదీ నుంచి వైకుంఠ ద్వార సర్వదర్శన టికెట్లు

10వ తేదీ నుంచి వైకుంఠ ద్వార సర్వదర్శన టికెట్లు

ఈ నెల (జనవరి) 10వ తేదీ నుంచి తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార సర్వదర్శనానికి టికెట్లను జారీ చేయనున్నట్టు  తిరుమల తిరుపతి దేవస్థానం (TTD)అదనపు ఈవో ధర్మారెడ్డి తెలిపారు. అయితే కరోనా నేపథ్యంలో కేవలం తిరుపతి వాసులకు మాత్రమే సర్వదర్శన టోకెన్లను జారీ చేయనున్నట్టు చెప్పారు. దీనికోసం తిరుపతిలో 5 ప్రాంతాల్లో టోకెన్ల జారీ కేంద్రాలను ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ఇవాళ(శనివారం) ఆయన టోకెన్ల జారీ  సెంటర్లను  పరిశీలించారు. 
 
10వ తేదీ ఉదయం 9 గంటలకు తిరుపతిలో సర్వదర్శనం టోకెన్లను జారీ చేస్తామని ధర్మారెడ్డి చెప్పారు. మున్సిపల్ కార్యాలయం, బైరాగి పట్టెడ రామానాయుడు పాఠశాల, సత్యనారాయణపురం జిల్లా పరిషత్ స్కూల్ , ముత్యాలరెడ్డి పల్లె, రామచంద్ర పుష్కరిణి దగ్గర టోకెన్ల జారీకి కౌంటర్లను ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ఈ నెల 13 నుంచి 22 వరకు రోజకు 5 వేల చొప్పున 50 వేల సర్వదర్శనం టికెట్లు జారీ చేస్తామని చెప్పారు. టికెట్ పొందిన భక్తులను ముందు రోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి అలిపిరి మార్గం నుంచి తిరుమలకు అనుమతిస్తామని తెలిపారు. భక్తులందరూ తప్పకుండా కరోనా రూల్స్  పాటించాలని సూచించారు.

మరిన్ని వార్తల కోసం..

యూట్యూబ్ చానెళ్లను కొనే ప్రయత్నం చేసిండు