కామారెడ్డిటౌన్, వెలుగు : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని సత్యసాయిబాబా మందిరంలో ఆదివారం సత్యసాయిబాబా జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. అడిషనల్ కలెక్టర్ మదన్మోహన్ బాబా ఫొటోకు పూలమాలలు వేశారు. భక్తులు ప్రత్యేక భజనలు, సేవా కార్యక్రమాలు చేపట్టారు. యూత్ వెల్ఫేర్ అధికారి వెంకటేశ్వర్గౌడ్, సేవా సమితి కన్వీనర్ లింబాద్రి, భాస్కర్శర్మ తదితరులు పాల్గొన్నారు.
ఆధ్యాత్మికతను అలవరచుకోవాలి
ధర్పల్లి , వెలుగు : ఆధ్యాత్మికతను అలవరచుకుంటే మనిషి ఎంతో సంతోషంగా ఉంటారని సత్యసాయి ట్రస్టు సభ్యులు అన్నారు. ఆదివారం సత్యసాయి సేవ సమితి ఆధ్వర్యంలో మండల కేంద్రంలో శత జయంతి ఉత్సవాలను నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు వ్యాస రచన పోటీలు, సాంసృతిక కార్యక్రమాలు నిర్వహించి విజేతలకు బహుమతులను అందజేశారు. కార్యక్రమంలో సత్యసాయి భక్తులు పాల్గొన్నారు.
