ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో అతి పెద్దదైన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) తన ఖాతాదారులకు గుడ్ న్యూస్ చెప్పింది. అన్ని రకాల రుణాలపై వడ్డీ రేటును మరో 10 బేసిస్ పాయింట్లు తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇలా వడ్డీరేట్లు తగ్గించడం ఇది ఐదోసారి. ఏప్రిల్ 10 నుంచి ఇప్పటి వరకు 45 బేసిస్ పాయింట్ల వరకు రుణ వడ్డీ భారం తగ్గింది. ఈనెల 10(మంగళవారం) నుంచి కొత్త రేట్లు అమల్లోకి రానున్నట్లు SBI తెలిపింది.
ఇప్పటివరకు ఇది 8.25 శాతంగా ఉన్నఏడాది కాలపరిమితి ఎంసీఎల్ఆర్ ఆధారిత రుణాల రేటు కొత్త రేట్ల ప్రకారం… 8.15%గా మారనుంది. అంతేకాదు ఫిక్స్డ్ డిపాజిట్లపై బ్యాంకులు చెల్లించే వడ్డీ రేట్లు తగ్గించినట్లు ప్రకటించింది SBI. అన్ని కాలపరిమితులున్న రిటైల్ ఫిక్స్డ్ డిపాజిట్లపై 20 నుంచి 25 బేసిస్ పాయింట్లు, బల్క్ డిపాజిట్లపై 10 నుంచి 20 బేసిస్ పాయింట్ల వరకు తగ్గించింది. ఈ రేట్లు కూడా రేపటి(మంగళవారం) నుంచే అమల్లోకి రానున్నాయి. దీంతో ఏడాది నుంచి రెండేళ్ల కాపరిమితి ఉన్న డిపాజిట్లపై 6.7% వడ్డీ 6.5% నికి తగ్గింది.