ఎస్బీఐ లాభం రూ. 20,160 కోట్లు

ఎస్బీఐ లాభం  రూ. 20,160 కోట్లు

హైదరాబాద్​, వెలుగు: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్​బీఐ), ఈ ఏడాది సెప్టెంబర్ 30తో ముగిసిన రెండవ క్వార్టర్​లో 10 శాతం వృద్ధితో రూ. 20,160 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. గత ఏడాది ఇదే క్వార్టర్​లో ఈ లాభం రూ. 18,331 కోట్లుగా ఉంది. బ్యాంకు మొత్తం ఆదాయం గత ఆర్థిక సంవత్సరం రెండవ క్వార్టర్​లో రూ. 1,29,141 కోట్ల నుంచి పెరిగి రూ. 1,34,979 కోట్లకు చేరింది. 

వడ్డీ ఆదాయం రూ. 1,13,871 కోట్ల నుంచి పెరిగి రూ. 1,19,654 కోట్లకు చేరుకుంది.  గ్రాస్​ఎన్​పీఏలు గత ఏడాది 2.13 శాతం నుంచి తగ్గి 1.73 శాతానికి చేరాయి. నెట్​ ఎన్​పీఏలు కూడా 0.53 శాతం నుంచి తగ్గి 0.42 శాతానికి పడ్డాయి. కన్సాలిడేటెడ్​ ప్రాతిపదికన బ్యాంకు లాభం 7 శాతం పెరిగి రూ. 21,137 కోట్లుగా నమోదైంది.