
యాదాద్రి, వెలుగు : హాస్టల్వార్డెన్లపై స్టేట్ ఎస్సీ డెవలప్మెంట్ కమిషనర్ క్షితిజ సీరియస్ అయ్యారు. కూరలు సరిపోను వండకుంటే పిల్లలు ఉత్త అన్నం ఎట్ల తింటరని ప్రశ్నించారు. మరోసారి ఇలా జరిగితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. భువనగిరిలోని ఎస్సీ బాలికలు, బాలుర హాస్టల్స్ను డిప్యూటీ డైరెక్టర్రమాదేవితో కలిసి గురువారం రాత్రి ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. వంట సరుకులు సహా పిల్లల కోసం చేసిన వంటలను పరిశీలించారు.
అన్నం ఉన్నప్పటికీ కూరలు సరిపోను లేకపోవడంతో వార్డెన్లపై సీరియస్ అయ్యారు. అనంతరం పిల్లలతో ముచ్చటించారు. ఈ సందర్భంగా తమకు ఇంగ్లిష్-తెలుగు డిక్షనరీలు, కథల బుక్స్ కావాలని పిల్లలు కోరగా, వారంలో పంపిస్తామని క్షితిజ తెలిపారు. ఆమె వెంట ఎస్సీ డెవలప్మెంట్ ఆఫీసర్శ్యాంసుందర్ఉన్నారు.