
- సంగారెడ్డి జిల్లా సదాశివపేటలో ఘటన
సదాశివపేట, వెలుగు: అయ్యప్ప మాలతో వెళ్లిన టెన్త్స్టూడెంట్ను సంగారెడ్డి జిల్లాలోని ఓ స్కూల్యాజమాన్యం లోనికి రానియ్యలేదు. మాల తీసే వరకు స్కూలుకు రావద్దని వెనక్కి పంపించారు. స్టూడెంట్తల్లి లక్ష్మి వివరాల ప్రకారం.. సదాశివపేటకు చెందిన రాకేశ్ స్థానిక సెయింట్ మేరీ హైస్కూల్లో టెన్త్క్లాస్చదువుతున్నాడు. అయ్యప్ప మాల ధరించిన రాకేశ్సోమవారం స్కూల్కు వెళ్లాడు. స్కూల్ సిబ్బంది అతన్ని అడ్డుకున్నారు. మాల తీసేసే వరకు స్కూలుకు రావొద్దని వెనక్కి పంపించారు. రాకేశ్ ఆ విషయాన్ని తల్లి లక్ష్మికి ఫోన్చేసి చెప్పాడు. ఆమె వచ్చి యాజమాన్యాన్ని నిలదీసింది. మాలతో వస్తే ఎందుకు అనుమతించరని ప్రిన్సిపల్ ను ప్రశ్నించింది. ఆ విషయం తెలుసుకున్న అయ్యప్ప స్వాములు, బీజేపీ లీడర్లు స్కూలుకు చేరుకుని యాజమాన్యంతో వాగ్వాదానికి దిగారు. దాంతో చివరికి రాకేశ్ను లోపలికి అనుమతించారు. ఇలాంటివి రిపీట్అయితే సహించేది లేదని, స్కూల్మేనేజ్మెంట్పై చర్యలు తీసుకోవాలని కౌన్సిలర్ మాణిక్రావు, అయ్యప్ప స్వాములు డిమాండ్చేశారు.