కోడేరు, వెలుగు: విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తించిన టీచర్ ను తల్లిదండ్రులు, గ్రామస్తులు చితకబాదారు. నాగర్ కర్నూల్ జిల్లా పెద్దకొత్తపల్లి మండలం గంట్రావుపల్లి గ్రామంలోని హైస్కూల్ లో పని చేస్తున్న ఇంగ్లీష్ టీచర్ పవన్ గత కొన్ని రోజులుగా విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు. ఈ విషయాన్ని విద్యార్థినులు తమ తల్లిదండ్రులకు చెప్పడంతో వారు మంగళవారం ఎంఈవో శ్రీనివాసరెడ్డి, ఎస్ఎంసీ చైర్మన్ నారాయణమ్మకు ఫిర్యాదు చేశారు.
ఉన్నతాధికారులకు ఈ విషయాన్ని తెలియజేసి విచారణ అనంతరం చర్యలు తీసుకుంటామని ఎంఈవో తెలిపారు. ఇదిలాఉంటే స్కూల్ అయిపోయాక సదరు టీచర్ ‘నా పైనే కంప్లైంట్ చేస్తారా? మీ అంతు చూస్తా’ అని అనడంతో కోపోద్రికులైన తల్లిదండ్రులు, గ్రామస్తులు అతడిని చితకబాదారు.
