ఎస్ఈఐఎల్కు గోల్డెన్ పీకాక్ అవార్డు

ఎస్ఈఐఎల్కు గోల్డెన్ పీకాక్ అవార్డు

హైదరాబాద్, వెలుగు:  విద్యుత్ ఉత్పత్తి సంస్థ ఈఐఎల్​ ఎనర్జీ ఇండియా, 2025 సంవత్సరానికి గాను 'గోల్డెన్ పీకాక్ అవార్డ్​ ఫర్ ఎక్సలెన్స్ ఇన్ కార్పొరేట్ గవర్నెన్స్'ను గెలుచుకుంది. ఇన్​స్టిట్యూట్ ఆఫ్ డైరెక్టర్స్ (ఐఓడీ) ఈ అవార్డును ప్రకటించింది. కార్పొరేట్ పాలనలో అత్యుత్తమ ప్రమాణాలను పాటిస్తున్నందుకు ఈ గౌరవం దక్కింది. 

ఈ గుర్తింపు విశ్వసనీయత,  వాటాదారుల విలువ కోసం కంపెనీ చేస్తున్న నిరంతర కృషికి నిదర్శనమని ఎస్​ఈఐఎల్ సీఈఓ జనమేజయ మహాపాత్ర అన్నారు. తమ అంకితభావాన్ని గుర్తించి ఈ అవార్డును అందుకోవడం గౌరవంగా ఉందని అన్నారు.  లండన్​లో వచ్చే నెల జరిగే ఐఓడీ ఇండియా వార్షిక గ్లోబల్ కన్వెన్షన్​లో ఈ అవార్డును కంపెనీ సీఈఓకి 
అందిస్తారు.