
వన్డే వరల్డ్ కప్ సెమీఫైనల్స్, ఫైనల్ మ్యాచ్ టికెట్లను శుక్రవారం నుంచి విక్రయించనున్నారు. ఉదయం ఎనిమిది గంటలకు సేల్స్ను ఓపెన్ చేయనున్నారు. https://tickets.cricketworldcup.comలో ఫ్యాన్స్ తమ టికెట్లను బుక్ చేసుకోవచ్చు. నవంబర్ 15, 16న వాంఖడే, ఈడెన్ గార్డెన్స్లో సెమీస్ మ్యాచ్లు జరుగుతాయి. నవంబర్ 19న జరిగే ఫైనల్కు నరేంద్ర మోదీ స్టేడియం ఆతిథ్యమివ్వనుంది. ఇప్పటికే ఇండో–పాక్ మ్యాచ్లకు సంబంధించిన టికెట్లన్నీ హాట్కేకుల్లా అమ్ముడుపోగా, మిగతా మ్యాచ్ల టికెట్ల విక్రయం కూడా దాదాపుగా పూర్తయినట్లు తెలుస్తోంది.