40డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రత.. 2011తర్వాత ఇదే అధికం

 40డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రత.. 2011తర్వాత ఇదే అధికం

దేశంలోని ఉత్తర ప్రాంతంలో వర్షాభావ పరిస్థితుల మధ్య అనేక నగరాలు సాధారణ ఉష్ణోగ్రతల కంటే ఎక్కువగా నమోదవుతున్నాయి. సెప్టెంబర్ 4న ఢిల్లీలో గరిష్టంగా 40.1 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది, సీజన్ లో సగటు కంటే ఇది ఆరు రెట్లు ఎక్కువ. 2011 తర్వాత సెప్టెంబర్‌లో నమోదైన ఉష్ణోగ్రతల్లో ఇదే అత్యధికం కావడం గమనార్హం.

నగరంలో ఆకాశం పాక్షికంగా మేఘావృతమై తేలికపాటి వర్షం కురుస్తుందని, గరిష్ఠ ఉష్ణోగ్రత 37 డిగ్రీలకు పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. పొరుగున ఉన్న రాజస్థాన్‌లోని చురులో 40 డిగ్రీలు, పిలానీలో 39.5 డిగ్రీలు నమోదయ్యాయి. అజ్మీర్, జైపూర్, కోటా, ఉదయ్‌పూర్ జోధ్‌పూర్, బికనీర్‌లలో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా నమోదయ్యాయని వాతావరణ శాఖ తెలిపింది.

గంగానగర్, బికనీర్, జైసల్మేర్‌లో 38 డిగ్రీలకు పైగా నమోదు కాగా, జైపూర్‌లో 37.2 డిగ్రీలు నమోదయ్యాయి. ఏది ఏమైనప్పటికీ, సెప్టెంబర్ వర్షపాతం లోటును భర్తీ చేయడంతో రుతుపవనాలు సాధారణంగానే ఉంటాయని వాతావరణ నిపుణులు సూచిస్తున్నారు. సెప్టెంబర్ 4 తర్వాత వర్షాలు పుంజుకుంటాయని అంటున్నారు.