బైక్ పార్కింగ్ విషయంలో పాతబస్తీలో గ్యాంగ్ వార్

బైక్ పార్కింగ్ విషయంలో పాతబస్తీలో గ్యాంగ్ వార్

హైదరాబాద్: నగరంలోని పాతబస్తీలోని రెండు వర్గాల మధ్య గ్యాంగ్ వార్ జరిగింది. భవానీ నగర్ లో రెండు గ్రూపులకు చెందిన యువకులు ఒకరిపై ఒకరు రాళ్లు రువ్వుకున్నారు. కర్రలతో దాడికి దిగారు. ఈ ఘటనలో పలువురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు పెద్ద సంఖ్యలో స్పాట్ కు చేరుకుని అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. ఎనిమిది మందిని అరెస్టు చేసి విచారిస్తున్నారు. బైక్ పార్కింగ్ విషయంలో ఇరు వర్గాల మధ్య గొడవ మొదలైందని స్థానికులు చెప్తున్నారు. ఈ ఏడాది జనవరిలో జరిగిన ఒక చిన్న విషయంలోనూ రెండు గ్రూపుల మధ్య గ్యాంగ్ వార్ జరిగింది. సైలన్సర్లు తీసి వేసి పెద్ద శబ్ధం వచ్చేలా బైకులు నడుపుతున్నందుకు ప్రశ్నించడంతో గొడవ మొదలైంది. దీంతో ఒక వర్గం వారు అక్కడున్న బైకులను తగలబెట్టడంతో ఘర్షణ తీవ్రస్థాయికి చేరుకుంది. ఆ గొడవలో ముగ్గురు పోలీసులతో సహా 11 మందికి తీవ్రంగా గాయాలయ్యాయి.