
- ఓటమి భయంతోనే కామారెడ్డి వైపు కేసీఆర్ చూపు
- కాంగ్రెస్ నుంచి పోటీ చేసేది నేనే
- కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ
కామారెడ్డి, వెలుగు: గజ్వేల్లో తన ఓటమిని ముందే గ్రహించి కామారెడ్డి నుంచి పోటీ చేసేందుకు కేసీఆర్వస్తున్నారని మాజీ మంత్రి, కాంగ్రెస్నేత షబ్బీర్అలీ అన్నారు. కాంగ్రెస్పార్టీ హాత్సే హాత్జోడో, గడపగడపకు కాంగ్రెస్పార్టీ ప్రోగ్రామ్లో భాగంగా ఆదివారం కామారెడ్డి మండలం ఉగ్రవాయిలో జరిగిన మీటింగ్లో షబ్బీర్అలీ మాట్లాడారు. గజ్వేల్లోని గ్రామాలను నీట ముంచి కామారెడ్డిని ముంచడానికి సీఎం వస్తున్నారని విమర్శించారు.
గజ్వేల్లో అభివృద్ధి చేశామని గొప్పలు చెప్పుకునే వారు ఈ రోజు భయంతో పారిపోయి వస్తున్నారని ఎద్దేవా చేశారు. గజ్వేల్లో చెల్లని రూపాయి కామారెడ్డిలో చెల్లుతుందా అని ప్రశ్నించారు. కామారెడ్డి నియోజకవర్గ బీఆర్ఎస్లో నెలకొన్న అంతర్గత కుమ్ములాటలు నిలువరించేందుకే కామారెడ్డిలో సీఎం కేసీఆర్ పోటీ అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారన్నారు. ఎమ్మెల్యే గంప గోవర్ధన్ఏ ఊరికి వెళ్లినా ప్రజలు అడ్డుకొని నిలదీసే పరిస్థితి ఉందన్నారు. కామారెడ్డిలో కేసీఆర్, కేటీఆర్, కవిత ఎవరు పోటీచేసినా కాంగ్రెస్ నుంచి మాత్రం తానే పోటీ చేస్తానని షబ్బీర్అలీ స్పష్టం చేశారు. డీసీసీ ప్రెసిడెంట్ కైలాస్ శ్రీనివాస్రావు, పీసీసీ సెక్రెటరీ ఇంద్రకరణ్రెడ్డి ఉన్నారు.