కులం పేరుతో దూషిస్తారా? ఇది సిగ్గుచేటు

కులం పేరుతో దూషిస్తారా? ఇది సిగ్గుచేటు

హాకీ ప్లేయర్ వందనా కటారియా కుటుంబాన్ని కులం పేరుతో దూషిస్తూ కొందరు చేసిన రభసను ఖండించారు హాకీ టీమ్ కెప్టెన్ రాణి రాంపాల్. ఇలాంటి ఘటనలు సిగ్గు చేటన్నారు. మతాలు, ప్రాంతాలూ వేరైనా... తామంతా భారత పతాకం కింద ఆడుతున్నామని చెప్పారు. ఈ నెల 5న అర్జెంటీనాతో మ్యాచ్ లో మన టీమ్ ఓడిన తర్వాత ఉత్తరాఖండ్ లోని హరిద్వార్ లో ఉన్న వందనా కటారియా ఇంటి ముందు  కొందరు నానా రభస చేశారు. వారి కులాన్ని దూషిస్తూ... అవమానించేలా... డ్యాన్సులు చేసి, పటాకులు కాల్చారు. దీనిపై వందన కుటుంబం పోలీసులకు కంప్లైంట్ చేసింది. 

మరిన్ని వార్తలు