మేడ్చల్ జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. శామీర్ పేట రాజీవ్ రహదారిపై ట్రాక్టర్ ని బైక్ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో బైక్ పై వెళ్తున్న ఇద్దరిలో ఒకరు అక్కడి కక్కడే చనిపోయాడు. మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. గాయపడిన వ్యక్తిని ఆస్పత్రికి తరలించారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. చనిపోయిన వ్యక్తిని సాయి చరణ్ (25) గా గుర్తించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని మేడ్చల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
మద్యం తాగి..అతి వేగంగా బైక్ నడపడం కారణంగానే ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చని పోలీసులు తెలిపారు.