సందడిగా శీతల్ ఉత్సవం

సందడిగా శీతల్ ఉత్సవం

మద్నూర్ వెలుగు:   మద్నూర్ లోని  పోచమ్మ ఆలయంలో సోమవారం ఉదయం రాజస్థానీ సమాజ్ ఆధ్వర్యంలో మహిళలు ప్రత్యేక పూజలు చేశారు.  ప్రతి ఏటా  హోలీ తర్వాత  వారానికి   శీతల్ ఉత్సవాన్ని జరుపుకుంటామని,  దేవత పోచమ్మ ఆలయంలో   కుటుంబ సమేతంగా  పూజలు చేస్తామని చెప్పారు.   శీతల్​ పండుగ సందర్భంగా  నిన్న వండిన  వంటలు తినడం సంప్రదాయమని వారు వివరించారు.