బాలీవుడ్‌‌‌‌‌‌‌‌ హీరోయిన్‌‌‌‌‌‌‌‌తో శిఖర్‌‌‌‌‌‌‌‌ ధవన్‌‌‌‌‌‌‌‌ స్టెప్పులు

బాలీవుడ్‌‌‌‌‌‌‌‌ హీరోయిన్‌‌‌‌‌‌‌‌తో శిఖర్‌‌‌‌‌‌‌‌ ధవన్‌‌‌‌‌‌‌‌ స్టెప్పులు

ఇండియా సీనియర్‌‌‌‌‌‌‌‌ క్రికెటర్‌‌‌‌‌‌‌‌ శిఖర్‌‌‌‌‌‌‌‌ ధవన్‌‌‌‌‌‌‌‌ బాలీవుడ్‌‌‌‌‌‌‌‌లో ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. యాక్టర్‌‌‌‌‌‌‌‌గా తనలోని మరో టాలెంట్‌‌‌‌‌‌‌‌ను నిరూపించుకోబోతున్నాడు. ‘డబుల్‌ ఎక్స్‌ఎల్‌’​ అనే సినిమాలో శిఖర్‌‌‌‌‌‌‌‌ అతిథి పాత్రలో కనిపిస్తాడని తెలుస్తోంది. హీరోయిన్‌‌‌‌‌‌‌‌ హుమా ఖురేషితో కలిసి ధావన్ తెరపై కనిపించనున్నాడు. ఈ ఇద్దరి సీన్లను ఇటీవల షూట్‌‌‌‌‌‌‌‌ చేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోను హుమా ఖురేషి తన ఇన్‌‌‌‌‌‌‌‌స్టాగ్రామ్‌‌‌‌‌‌‌‌లో షేర్‌‌‌‌‌‌‌‌ చేసింది. ఇందులో బ్లాక్‌‌‌‌‌‌‌‌ సూట్‌‌‌‌‌‌‌‌లో ఉన్న ధవన్‌‌‌‌‌‌‌‌.. హీరోయిన్‌‌‌‌‌‌‌‌తో స్టెప్పులు వేస్తున్నట్టు కనిపించాడు.

కాగా, ‘డబుల్‌ ఎక్స్‌ఎల్‌’ చిత్రాన్ని దర్శకుడు సత్రాం రమానీ రూపొందిస్తున్నారు. ఈ మూవీ వచ్చే నెల 4న ఓటీటీలో స్ట్రీమింగ్‌ కానుంది. ఈ చిత్రంలో స్పోర్ట్స్‌ ప్రెజెంటర్‌ రాజశ్రీ త్రివేది పాత్రలో హ్యూమా ఖురేషి నటిస్తుండగా.. ఫ్యాషన్‌ డిజైనర్‌ సైరా ఖన్నా క్యారెక్టర్‌లో సోనాక్షీ సిన్హా కనిపించనుంది. బరువైన ఈ ఇద్దరు భామలు సొసైటీ నుంచి ఎదుర్కొనే మాటలు నేటి సమాజ తీరును చూపిస్తాయని, అవి భరిస్తూ వారు సాధించే విజయాలు స్ఫూర్తి నింపుతాయని చిత్రబృందం చెబుతున్నది. అయితే ఈ చిత్రంలో ధవన్‌ అతిథి పాత్రలో నటించడం విశేషం.