- కారులో నిద్రిస్తుండగా అటాక్
- చనిపోయాడని నిర్ధారించుకుని దుండగులు పరార్
- హర్యానాలోని ఝజ్జర్లో ఘటన
చండీగఢ్: హర్యానాకు చెందిన వ్యాపారిని ఇద్దరు దుండగులు కాల్చి చంపేశారు. ఆదివారం ఝజ్జర్లోని ముర్తల్ దాబా వద్ద పార్కింగ్ చేసిన తన కారులో నిద్రిస్తుండగా ఇద్దరు గుర్తు తెలియన వ్యక్తులు అటాక్ చేశారు. కారులోంచి ఆయనను బయకు లాగి పిస్టల్స్తో కాల్పుల వర్షం కురిపించారు. వ్యాపారి ఒంట్లో 35 బులెట్లు దింపారు. వ్యాపారి చనిపోయారని నిర్ధారించుకుని పరారయ్యారు.
మృతుడు హర్యానా రాష్ట్రం గోహనాలోని సరగ్తాల్ గ్రామానికి చెందిన మద్యం వ్యాపారి సుందర్ మాలిక్(38)గా పోలీసులు గుర్తించారు. మాలిక్ అక్కడి నుంచి పారిపోయేందుకు ప్రయత్నించాడు. వారిలో ఒకరిని కాళ్లు పట్టుకుని కిందపడేసి కదలకుండా పట్టుబిగించాడు. అయితే, మరోవ్యక్తి మాలిక్పై కాల్పులు జరపడం సీసీటీవీ కెమెరాలో రికార్డయింది. ఈ వీడియో ఆధారంగా పోలీసులు హంతకుల కోసం గాలిస్తున్నారు.c