అమెరికాలో కాల్పులు.. ముగ్గురు మృతి

అమెరికాలో కాల్పులు.. ముగ్గురు మృతి
  • మిస్సోరిలోని కన్సాస్ సిటీలో దారుణం

మిస్సోరి(అమెరికా): అమెరికాలోని మిస్సోరి రాష్ట్రంలో ఆదివారం కాల్పుల ఘటన చోటుచేసుకుంది. రాష్ట్రంలోని కాన్సస్ సిటీలో ప్రాస్పెక్ట్ అవెన్యూ 57 స్ట్రీట్​లో తెల్లవారుజామున కాల్పుల శబ్దం వినిపించిందని పోలీసులకు సమాచారం అందింది. దీంతో అక్కడికి చేరు కున్న పోలీసులకు మూడు మృతదేహాలను గుర్తించారు. ఇద్దరు పురుషులు, ఒక మహిళకు చెందిన మృతదేహాలను గుర్తించినట్లు ప్రకటించారు. ప్రాథమిక విచారణలో శనివారం రాత్రి ఆ ఏరియాలో పెద్ద సంఖ్యలో జనం గుమి గూడిన దాఖలాలు ఉన్నాయని పోలీసులు తెలి పారు. బహుశా ఆ కార్యక్రమంలోనే గొడవ జరిగి కాల్పులకు దారితీసి ఉంటుందని అభిప్రా యపడ్డారు. అక్కడ ఎలాంటి కార్యక్రమం జరి గినట్లు తమకు సమాచారం అందలేదని వివ రించారు.

ఈ క్రమంలో అక్కడ చట్టవిరుద్ధమైన పనులేవో జరుగుతున్నట్లు పోలీసులు సం దేహం వ్యక్తంచేశారు. గాయపడ్డ ఐదుగురు బాధితులు వేర్వేరు ఆస్పత్రులలో చేరినట్లు సమాచారం అందిందన్నారు. ఈ ఏరియాకు దగ్గర్లోనే మరో కాల్పుల ఘటన చోటుచేసుకుందని పోలీసులు తెలిపారు. అయితే, అక్కడ ప్రాణనష్టం వివరాలు కానీ, బుల్లెట్​ గాయాలైన బాధితుల వివరాలు కానీ వెల్లడించలేదు.