హైదరాబాద్: శ్రీసిమెంట్ ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లా దాచేపల్లి గ్రామంలో రూ. 2,500 కోట్ల పెట్టుబడితో నిర్మించిన కొత్త ఇంటిగ్రేటెడ్ ప్లాంట్ను ప్రారంభించింది. దీనివల్ల ఉత్పత్తి సామర్థ్యం మూడు మిలియన్ టన్నుల నుంచి 56.4 మిలియన్ టన్స్పర్ యానమ్(ఎంటీపీఏ)లకు పెరిగింది.
గుంటూరు ప్లాంట్ శ్రీ సిమెంట్కు దేశంలోనే ఆరవ ఇంటిగ్రేటెడ్ ప్రొడక్షన్ ఫెసిలిటీగానూ, కర్ణాటకలోని కోడ్లా తర్వాత దక్షిణ ప్రాంతంలో రెండో స్థానంలోనూ నిలవనుంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మార్కెట్ల అవసరాలను తీర్చడానికి ఉపయోగపడే ఈ ప్లాంటు దాదాపు 700 ప్రత్యక్ష ఉద్యోగాలు, 1300 పరోక్ష ఉద్యోగాలను సృష్టించగలదని అంచనా.