అశ్విని-క్రాస్టో ర్యాంక్‌‌‌‌ మెరుగు

అశ్విని-క్రాస్టో ర్యాంక్‌‌‌‌ మెరుగు

–న్యూఢిల్లీ: ఇండియా విమెన్స్‌‌‌‌ డబుల్స్‌‌‌‌ స్టార్‌‌‌‌ ప్లేయర్లు అశ్విని పొన్నప్ప–తనీషా క్రాస్టో జోడీ.. బీడబ్ల్యూఎఫ్‌‌‌‌ ర్యాంకింగ్స్‌‌‌‌ను మెరుగుపర్చుకున్నారు. మంగళవారం విడుదల చేసిన తాజా జాబితాలో ఈ జోడీ నాలుగు స్థానాలు మెరుగుపడి 28వ ర్యాంక్‌‌‌‌లో నిలిచింది. 

ట్రీసా జాలీ–పుల్లెల గాయత్రి 19వ ర్యాంక్‌‌‌‌లో కొనసాగుతున్నారు. మెన్స్‌‌‌‌ డబుల్స్‌‌‌‌లో సాత్విక్‌‌‌‌ సాయిరాజ్‌‌‌‌–చిరాగ్‌‌‌‌ షెట్టి జంట రెండో ర్యాంక్‌‌‌‌లోనే కొనసాగుతున్నది. మెన్స్‌‌‌‌ సింగిల్స్‌‌‌‌లో ప్రియాన్షు రజావత్‌‌‌‌ ఒక ర్యాంక్‌‌‌‌ మెరుగుపడి టాప్‌‌‌‌–30లోకి వచ్చాడు. హెచ్‌‌‌‌. ఎస్‌‌‌‌. ప్రణయ్‌‌‌‌ ఒక్కడే 8వ ర్యాంక్‌‌‌‌లో ఉన్నాడు.