సింగరేణిలో జోనల్ మైన్స్ రెస్క్యూ పోటీలు షురూ

సింగరేణిలో జోనల్ మైన్స్ రెస్క్యూ పోటీలు షురూ

గోదావరిఖని, వెలుగు :  సింగరేణి 54వ జోనల్​ మైన్స్​ రెస్క్యూ పోటీలు బుధవారం యైటింక్లయిన్​ కాలనీలోని ఆర్జీ –2 ఏరియా రెస్క్యూ స్టేషన్​లో షురూ అయ్యాయి. సింగరేణి ప్లానింగ్​, ప్రాజెక్ట్స్​ డైరెక్టర్​ కె.వెంకటేశ్వర్లు, డైరెక్టర్​ఆఫ్​ మైన్స్​సేఫ్టి ఉమేశ్​ఎం.సావర్కర్​పోటీలపు ప్రారంభించి మాట్లాడారు. రెండు రోజులు జరిగే  పోటీల్లో వివిధ విభాగాల్లో ప్రతిభ చూపిన టీమ్ లను నాగ్​పూర్​లో నిర్వహించే జాతీయ స్థాయి మైన్స్​రెస్క్యూ పోటీలకు ఎంపిక చేయనున్నట్టు పేర్కొన్నారు.  

పురుషుల జట్టుతో పాటు మహిళల జట్టు కూడా పాల్గొని ఎలాంటి ఒత్తిడికిలోను కాకుండా తమ ప్రతిభ చూపాయిన తెలిపారు.  పోటీలకు జడ్జిలుగా డీడీఎంఎస్​ ఆఫీసర్లు కిషోర్ కుమార్​, దిలీప్ కుమార్​, షేక్ నాగుల్ మీరా, సనత్ కుమార్, కె‌.ప్రేమ్ కుమార్, కమలేశ్ కుమార్ వర్మ, కోమల్ చౌదరి, అనికేత్ సింగ్,  సుధీర్ కుమార్​వ్యవహరిస్తున్నారు. కార్యక్రమంలో సింగరేణి జనరల్​మేనేజర్లు చింతల శ్రీనివాస్, సుధాకర్​రావు, కె.శ్రీనివాస్ రెడ్డి, డి.లలిత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.