టెక్సాస్ లో కాల్పులు సిక్కు పోలీసు అధికారి మృతి

టెక్సాస్ లో కాల్పులు సిక్కు పోలీసు అధికారి మృతి

అమెరికాలో భారత సంతతికి చెందిన సిక్కు పోలీసు అధికారిని ఓ దుండగుడు కాల్చి చంపాడు. టెక్సాస్ రాష్ట్రంలో ఈ ఘటన జరిగింది. ఓ ట్రాఫిక్ స్టాప్ దగ్గర సందీప్ సింగ్ ధలివాల్ అనే అధికారి విధులు నిర్వహిస్తున్న సమయంలో వెనుకవైపు నుంచి ఆయనను కాల్చి చంపాడు. సందీప్ సింగ్ కు భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు.

విధుల్లో ఉన్న సందీప్ సింగ్ ఓ కారును ఆపాడు. అందులో ఓ పురుషుడు, మహిళ ఉన్నారు. కారును ఆపిన వెంటనే అందులో ఉన్న వ్యక్తి వెంటనే కిందకు దిగి.. విచక్షణా రహితంగా కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో అతను ప్రాణాలు కోల్పోయాడు. కాల్పులు జరిపిన వెంటనే దుండగుడు సమీపంలోని షాపింగ్ సెంటర్ వైపు పరుగెత్తాడు. కాల్పులకు తెగబడ్డ వ్యక్తిన పోలీసులు.. అతడితో పాటు ఉన్న మహిళను కూడా అదుపులోకి తీసుకున్నారు.కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు.