V6 News

సింధుకు అరుదైన గౌరవం.. బీడబ్ల్యూఎఫ్ కౌన్సిల్ మెంబర్‌‌‌‌‌‌‌‌గా ప్రస్థానం ప్రారంభం

సింధుకు అరుదైన గౌరవం.. బీడబ్ల్యూఎఫ్ కౌన్సిల్ మెంబర్‌‌‌‌‌‌‌‌గా ప్రస్థానం ప్రారంభం

హార్సెన్స్‌‌‌‌ (డెన్మార్క్‌‌‌‌): ఇండియా స్టార్ షట్లర్, డబుల్ ఒలింపిక్ మెడలిస్ట్  పీవీ సింధు ఇంటర్నేషనల్ లెవెల్‌‌‌‌లో మరో అరుదైన గౌరవం దక్కించుకుంది. 

బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ (బీడబ్ల్యూఎఫ్‌‌‌‌) అథ్లెట్ల కమిషన్ చైర్మన్‌‌‌‌గా ఉన్న సింధు ఇప్పుడు ఆ కౌన్సిల్‌‌‌‌లో పూర్తిస్థాయి ఓటింగ్ అధికారం కలిగిన మెంబర్‌‌‌‌‌‌‌‌గా తన ప్రస్థానాన్ని ప్రారంభించింది. ఈ మేరకు శనివారం జరిగిన బీడబ్ల్యూఎఫ్‌‌‌‌ ఏజీఏంకు సింధు తొలిసారి అటెండ్ అయింది.

దాంతో యాక్టివ్ ప్లేయర్‌‌‌‌‌‌‌‌గా ఉంటూనే వరల్డ్ బ్యాడ్మింటన్ పాలనలో ఓటింగ్ హక్కు అందుకున్న ప్లేయర్‌‌‌‌‌‌‌‌గా నిలిచింది. బ్యాడ్మింటన్ తనకు ఎంతో ఇచ్చిందని, ఇప్పుడు ఈ ఆట  అభివృద్ధికి తన వంతు సహకారం అందించే అవకాశం దక్కడంపై సింధు కృతజ్ఞత వ్యక్తం చేసింది.  ప్రపంచవ్యాప్తంగా ఉన్న  ప్లేయర్ల సమస్యలను, వారి అభిప్రాయాలను ఈ వేదికపై బలంగా వినిపిస్తానని ఆమె  హామీ ఇచ్చింది.