
- సింగరేణి కార్మికులు, ఉద్యోగుల నుంచి బ్యాలెట్ ఓటింగ్ ద్వారా అభిప్రాయాల సేకరణ
కోల్బెల్ట్, వెలుగు: సింగరేణి కార్మికులు, ఉద్యోగులకు సొంతింటి పథకం అమలు చేయాలని డిమాండ్చేస్తూ ఓటింగ్ కార్యక్రమం నిర్వహించారు. గురువారం మంచిర్యాల జిల్లా మందమర్రి, శ్రీరాంపూర్ఏరియాల్లోని బొగ్గు గనులు, డిపార్ట్మెంట్లపై ఓటింగ్చేపట్టారు.
సింగరేణి కాలరీస్ఎంప్లాయీస్యూనియన్(సీఐటీయూ) ఆధ్వర్యంలో చేపట్టిన కార్యక్రమంలో భాగంగా ‘ సొంతిల్లు కావాలా.. క్వార్టర్ కావాలా’ అంశంపై కార్మికులు, ఉద్యోగుల అభిప్రాయాలను బ్యాలెట్ ఓటింగ్ ద్వారా సేకరించారు. ఇందు కోసం ఆయా ప్రాంతాల్లో పోలింగ్ బ్యాలెట్ బాక్స్ లు ఏర్పాటు చేశారు. ఉద్యోగులు, కార్మికులు స్వచ్ఛందంగా ఓటింగ్లో పాల్గొన్నారు.
అనంతరం సీఐటీయూ లీడర్లు మాట్లాడుతూ ఎన్నికల సమయంలో కార్మికులకు సొంతింటి పథకం అమలు చేస్తామని, అన్ని పార్టీలు, కార్మిక సంఘాలు హామీలిచ్చి అధికారంలోకి రాగానే విస్మరిస్తున్నాయన్నారు. కార్యక్రమంలో లీడర్లు ఎస్. వెంకటస్వామి,అల్లి రాజేందర్,రామగిరి రామస్వామి,చంద్రశేఖర్,గుళ్ల బాలాజీ,ప్రకాశ్,రంజిత్ కుమార్,ప్రవీణ్,సతీశ్,శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
గోదావరిఖనిలో..
గోదావరిఖని : సీఐటీయూ అనుబంధ సింగరేణి కాలరీస్ఎంప్లాయీస్ యూనియన్ఆధ్వర్యంలో ఆర్జీ –1, ఆర్జీ –2, ఆర్జీ –3 ఏరియాల్లోని ఆఫీస్లు, డిపార్ట్మెంట్లు, బొగ్గు గనులు, ఓపెన్కాస్ట్ ప్రాజెక్ట్వద్ద సొంతింటిపై ఓటింగ్నిర్వహించారు.